అధిష్టానం ఆదేశిస్తే మా తమ్ముడు అర్వింద్‌పై పోటీ చేస్తా: సంజయ్

by Disha Web Desk 2 |
అధిష్టానం ఆదేశిస్తే మా తమ్ముడు అర్వింద్‌పై పోటీ చేస్తా: సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నాయకుడు డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నాడని సొంత తమ్ముడిపై సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే అర్వింద్‌పై పోటీ చేయడానికి సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖలు బీజేపీ చేస్తు్న్న డర్టీ పాలిటిక్స్‌ అని అసహనం వ్యక్తం చేశారు. అర్వింద్ మా నాన్నను బ్లాక్‌మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా నాన్న(డీఎస్)కు ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారని మండిపడ్డారు. డీఎస్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని ఆవేదన చెందారు. కాగా, ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరిక డీఎస్‌ కుటుంబంలో రాజకీయ చిచ్చుకు కారణమైంది.

Next Story

Most Viewed