కాంగ్రెస్ మేనిఫెస్టో మైనార్టీ ప్రాపర్టీలా ఉంది: ధర్మపురి అర్వింద్

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ మేనిఫెస్టో మైనార్టీ ప్రాపర్టీలా ఉంది: ధర్మపురి అర్వింద్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో మైనార్టీ ప్రాపర్టీలా ఉందని ఎద్దేవా చేశారు. హిందువుల దగ్గర దోచుకుంటూ ముస్లింలకు పంచి పెట్టేలా మేనిఫెస్టో రూపొందించారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం బలమైన శక్తిగా ఎదగటం చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మామూలుగా అయితే సీఎం రేవంత్‌ రెడ్డి సమర్థుడు అన్నారు. అదే కాంగ్రెస్‌లో ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారని పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డికి చాలా రాజకీయ జీవితం ఉందని.. మరో 15 ఏళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారని అన్నారు. కానీ ఆయన ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం భవిష్యత్తు లేదని అన్నారు. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని హితవుపలికారు. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. రేవంత్‌ బీజేపీలోకి వస్తే ఓ స్నేహితుడిలా స్వాగతిస్తానని అన్నారు. అయితే, అర్వింద్ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed