- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dharmapuri Aravind : బనకచర్లకు అనుమతులు ఇచ్చిందే కేసీఆర్ : ధర్మపురి అరవింద్
ఏపీ ప్రతిపాదిత గోదావరి-బనకచర్ల(Godavari-Banakacherla)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రతిపాదిత గోదావరి-బనకచర్ల(Godavari-Banakacherla)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind) కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే అనుమతులు లభించాయని, అప్పట్లో జగన్, కేసీఆర్(Jagan-KCR) కలిసి తీసుకున్న నిర్ణయం ఇదని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇస్తోందని.. అసలు తెలంగాణకు ఎంత నీరు కావాలో ఆయనకే అవగాహన లేదని అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు సముద్రంలో వృథాగా పోయే 3,000 టీఎంసీ గోదావరి నీటిలో కేవలం 200 టీఎంసీ నీటిని రాయలసీమకు తరలించడానికి ఉద్దేశించినదని, ఇది తెలంగాణ హక్కులకు హాని కలిగించదని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోందని, దిగువ రాష్ట్రంగా తమ హక్కులను వినియోగించుకుంటోందని అరవింద్ పేర్కొన్నారు.






