మలేరియా కంట్రోల్​ లో ఉంది.. డీహెచ్​ డాక్టర్​ శ్రీనివాసరావు

by Dishafeatures2 |
మలేరియా కంట్రోల్​ లో ఉంది.. డీహెచ్​ డాక్టర్​ శ్రీనివాసరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కంట్రోల్ అయిందని డీహెచ్​ డాక్టర్​ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి పరిస్థితులను ఆయన సోమవారం మీడియాకు విడుదల చేశారు. గడిచిన ఏడు ఏళ్లలో మలేరియాతో ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు. 2014 లో 5222 కేసులు ఉండగా, 2015లో 11,880 కేసులు తేలాయన్నారు. ఇదే ఏడాదిలో నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. ఇక 2016లో 3575 కేసులు తేలగా, ఒకరు చనిపోయినట్లు పేర్కొన్నారు.

దీంతో పాటు 2017లో 2688 మంది, 2018లో 1792 మంది, 2019లో 1709 మంది, 2020లో 872 మంది, 2021లో 871 మంది, 2022 లో 611 మంది ఈ ఏడాది ఇప్పటి వరకు 84 మందికి మలేరియా సోకినట్లు వెల్లడించారు. మలేరియా కేసులు తేలుతున్న కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్​,భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్​జిల్లాల్లో దోమల నివారణ మందులను ఎక్కువగా స్ప్రే చేస్తున్నామన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. మలేరియా కంట్రోల్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా వచ్చాయన్నారు.



Next Story

Most Viewed