డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్తను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-22 11:48:57  IST  )

డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్తను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది.

డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్తను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్(IPS)​అధికారులు వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌లో జాయిన్​కావాలని కేంద్ర హోంశాఖ(Central Home Ministry) శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్(Anjani Kumar), ఐపీఎస్‌లు అభిషేక్​మహంతి(Abhishek Mahanty), అభిలాష బిస్త్‌(Abhilash Bisht)లను ఏపీలో జాయిన్ కావాల్సిందిగా సూచించింది. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‌లను రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. కాగా, క్యాట్ ఆదేశాల మేరకు ప్రస్తుతం వీరు తెలంగాణలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Next Story