మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు: Union Minister G.Kishan Reddy

by Disha Web Desk 19 |
మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు: Union Minister G.Kishan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు హైదరాబాద్ జలమయమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరాయి. వర్షపు నీటితో నిండిపోయి నాళాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యూసఫ్ గూడలో పర్యటించారు. పొంగిపొర్లుతున్న నాళాలను ఆయన పరిశీలించారు. నాలా నీటితో బస్తీల్లోని రోడ్లన్నీ జలమయం కావడంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదన్నారు. డ్రైనేజీలు పొంగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

Read More: పెరిగిన ఇన్ ఫ్లో.. ప్రమాదపు అంచున జంట జలాశయాలు..!



Next Story

Most Viewed