HYD: కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

by Disha Web Desk 2 |
HYD: కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం బీఆర్ఎస్‌కు జీహెచ్ఎంసీ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు గుడ్ బై చెప్పారు. ఇదివరకే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.

పార్టీ విధానాలతో తమకు నష్టం వాటిల్లిందని కేసీఆర్‌కు రాసిన రాజీనామా లేఖలో శ్రీలత లేఖలో పేర్కొన్నారు. పాతికేళ్లుగా బీఆర్ఎస్‌లో ఉన్నామని, ఉద్యమంలో పోరాటం చేశామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని వాపోయారు. పార్టీ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడంతో చాలా బాధపడ్డారన్నారు.



Next Story