- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దానిని త్వరలోనే అమలు చేయబోతున్నాం.. DCM భట్టి కీలక ప్రకటన
పార్టీ నిర్మాణంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెంచారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ నిర్మాణంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెంచారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో బుధవారం నిర్వహించిన ఏఐసీసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కులగణనను రాహుల్గాంధీ ప్రస్థావించడం సంతోషకరమన్నారు. సంపద అందరికీ సమానంగా పంచాలని కాంగ్రెస్ అభిమాతం అన్నారు. దండి సత్యగ్రహ స్ఫూర్తితో కాంగ్రెస్జనంలోకి ముందుకు వెళుతుందున్నారు. సబర్మతి ఒడ్డు నుంచి మరొక్కసారి ఈ దేశానికి సందేశం ఇవ్వాలనే న్యాయ్పథ్ ఈ ప్లీనరీలో తీసుకోవడం జరిగింది.
ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు అవకాశాలు అన్ని కూడా పెద్దున కుల గణన సర్వే మాదిరి అన్నింటిని పంచాలని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ నిర్మానం అనేది రాహుల్గాంధీకి మొదటి నుంచి ఉన్నటువంటి ఆలోచన, దానిని కిందిస్థాయి నుంచి కూడా గ్రామీణ స్థాయి బూత్కమిటీ నుంచి నిర్మాణం చేసుకుంటూ రావాలని, అలాగే జిల్లా కాంగ్రెస్నాయకత్వంలో అధ్యక్షులు నాయకత్వంలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని, వాళ్లు ఆ జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి వాళ్లే దళపతుళ్లగా ఉండి విధానపరమైన నిర్ణయాలు జరగాలని పార్టీ నిర్ణయం తీసుకోని ప్రకటించడం జరిగిందని, త్వరలోనే అమలు కూడా చేయబోతున్నారని తెలిపారు.






