తమ్మినేనిని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Disha Web Desk 1 |
తమ్మినేనిని పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటుకు గురైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయనను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన హెల్త్ కండీషన్ గురించి చికిత్స అందజేస్తున్న డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తమ్మినేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు నిన్న రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. వీరభద్రం చికిత్సకు స్పందిస్తున్నారని, వెర్బల్ కమ్యూనికేషన్‌కు ద్వారా ఆయన స్పందిస్తున్నారని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed