తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడింది: డిప్యూటీ సీఎం భట్టి

by Disha Web Desk 2 |
తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడింది: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కోసం ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం వచ్చిందని అన్నారు. కాగా, ప్రమాణ స్వీకారానికి ముందు ఇంట్లో భట్టి పూజలు చేశారు. ఆ సమయంలో పూజ గదిలో వైఎస్సార్ ఫొటో కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉండగా.. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నాలుగవసారి బంపర్ మెజార్టీతో భట్టి గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Next Story