వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయండి.. అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశం

by Gantepaka Srikanth |

నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి థర్మల్​పవర్​ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్​నుండి వీడియో కాన్ఫరెన్స్​ద్వారా సమీక్షించారు.

వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయండి.. అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి థర్మల్​పవర్​ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్​నుండి వీడియో కాన్ఫరెన్స్​ద్వారా సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు జెన్​కో సీఎండీ సందీప్​కుమార్ సుల్తానియా, బీహెచ్​ఈఎల్​సీఎండీ కే.సదాశివ మూర్తి, జెన్​కో ఉన్నతాధికారుతో పాటు జెన్​కో యాదాద్రి పవర్​ప్లాంట్​ఇంజినీర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని కేబుల్స్, వాల్వులకు స్పల్ప నష్టం వాటిల్లినట్లు ఈ సందర్భంగా తెలుసుకున్నారు.

ముఖ్యంగా ఇంధనం ఆయిల్​లీకేజీనే ఈ అగ్నిప్రమాదానికి కారణంగా గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు తెలిపారు. ప్రస్తుతం ఈ యూనిట్​బీహెచ్​ఈఎల్​ఆధీనంలోని ట్రయల్​ఆపరేషన్​విభాగంలోనే ఉన్నట్లు గుర్తించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కాలేదని అధికారులు డిప్యూటీ CM దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అధికారులకు సూచిస్తూ వీలైనంత త్వరగా యూనిట్​మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. నేడు మంగళవారం నాటికే యూనిట్​పనులను పున:ప్రారంభించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ నష్టం ప్లాంట్​సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగించదని, మరమ్మతు పనులను 7 నుంచి 10 రోజులలో సమాంతరంగా చేపట్టవచ్చని బీహెచ్​ఈఎస్​తెలియజేసిందని డిప్యూటీ సీఎం వివరించారు.

Next Story