- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ ప్రారంభం అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ భేటీపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ మీటింగ్కు హాజరయ్యే ముందు కాళేశ్వరం కమిషన్ నివేదిక (Kaleshwaram Commission Report) అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నివేదిక చూస్తే కానీ ఏముందో తెలియదని భట్టి విక్రమార్క చెప్పారు. కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు. నివేదికపై చర్చించిన తర్వాత ఏం చేయాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని భట్టి వెల్లడించారు.
కాగా, కేబినెట్ భేటీ అనంతరం ఈ నివేదికపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అధికారుల సమాచారం. ఇక, బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్దేనని కాళేశ్వరం కమిషన్ నివేదికల ద్వారా తేల్చిచెప్పింది. అవకతవకలు జరిగాయని రిపోర్టు రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.






