Indira Gandhi : దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి డిప్యూటీ సీఎం భట్టి నివాళులు

by Y. Venkata Narasimha Reddy |

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పివి మార్క్ వద్ద ఉన్న ఇందిరా విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభృతులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Indira Gandhi : దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి డిప్యూటీ సీఎం భట్టి నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్ : దివంగత ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పివి మార్క్ వద్ద ఉన్న ఇందిరా విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభృతులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, అనిరుధ్ రెడ్డి, నాయకులు విజయా రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అటు గాంధీభవన్ లో జరిగిన ఇందిరా గాంధీ జయంతిలోనూ వారు పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను, బలిదానాన్ని స్మరించుకున్నాకు. ఇందిరా స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు దేశ ప్రగతిలో పునరంకితం కావాలన్నారు

Next Story