- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముగిసిన ఈడీ కస్టడీ.. MLC కవిత మరో సంచలన నిర్ణయం (వీడియో)
దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగిసింది. శనివారం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని మరోసారి కోర్టును కోరారు. విచారణ అనంతరం కవిత మాట్లాడుతూ.. ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడిగారని అన్నారు. ఇది అక్షరాల అక్రమ అరెస్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అరెస్ట్పై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన తప్పుడు కేసు అని అన్నారు. కాగా, అంతకుముందు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పీఎంఎల్ఏ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు.
మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలిచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రికార్డ్స్ రిపోర్ట్స్ అందించాలంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు అరెస్ట్ అయిన మార్చి 15వ తేదీ నుంచి హైపర్ టెన్షన్తో కవిత ఇబ్బంది పడుతున్నారు. 15న న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలోనే హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడ్డారని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.