రేపు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి.. పిలుపునిచ్చిన డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం

by Dishafeatures2 |
రేపు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి.. పిలుపునిచ్చిన డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చినట్లుగా 12 వేల టీచర్ పోస్టులకు వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలిపారు. కాగా మంగళవారం విద్యాశాఖ ముట్టడికి పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్డీకాపూల్ లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని, కొనసాగిస్తామని డీఈడీ, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed