బ్లాక్ మెయిల్ చేసి బతికే రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు..? దాసోజు శ్రవణ్

by Disha Web Desk 19 |
బ్లాక్ మెయిల్ చేసి బతికే రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు..? దాసోజు శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చంద్రభూతం రేవంత్ రూపంలో తెలంగాణ రైతుల అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌ను.. తెలుగుదేశం కాంగ్రెస్‌గా రేవంత్ రెడ్డి మార్చారని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ చేసి బతికే రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు అని ప్రశ్నించారు. అన్నదాతలను తూలనాడుతున్న రేవంత్ రెడ్డిది అహంకారం అన్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి.. రైతులకు వద్దా..? మూడు గంటల్లో మూడు ఎకరాలు నీళ్లు ఎలా పారుతాయో అతి తెలివిగా మాటలు కాదు చేసి చూపించాలన్నారు.

ఎర్ర నెలలు ఉన్నచోటుకైనా.. రేగడి నెలలు ఉన్న చోటకైనా వెళ్లి అడుగుదాం అని రేవంత్‌కు సవాల్ చేశారు. ఇవి రేవంత్ రెడ్డి మాటలు కాదు.. చంద్రబాబు తోలుబొమ్మలా ఆడిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. రైతాంగానికి అన్ని బాధల నుంచి శాశ్వత విముక్తి లభిస్తున్న తరుణంలో రేవంత్ రూపంలో కొత్త భాదవచ్చిపడిందన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఏమిటో ఆయన వ్యాఖ్యలతో బయట పడిందన్నారు. రైతులంతా విజ్ఞతతో అలోచించి ఇలాంటి నాయకుడిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని రైతులను కోరారు. పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.



Next Story

Most Viewed