ఆధారాలు మేము ఇస్తే.. నువ్వేమ్ పీ**వ్ రేవంత్ రెడ్డి: దాసోజు శ్రవణ్

by Disha Web Desk 12 |
ఆధారాలు మేము ఇస్తే.. నువ్వేమ్ పీ**వ్ రేవంత్ రెడ్డి: దాసోజు శ్రవణ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించి.. సాగునీటి సమస్య, పెట్టుబడి కారణంగా 200 మంది రైతులు చనిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ లో మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన మూడు నెలల్లో 200 మంది రైతులు చనిపోయారి కేసీఆర్ అన్నారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తే వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. చనిపోయిన రైతుల వివరాలు మేము ఇస్తే.. నువ్వెందుకు ఉన్నావ్.. ఏం పీ**కి ఉన్నావ్ అంటూ దాసోజు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.



Next Story

Most Viewed