పండగ వాతావరణం క్రియేట్ చేయాలి.. అధికారులకు CS ఆదేశం

by GSrikanth |
పండగ వాతావరణం క్రియేట్ చేయాలి.. అధికారులకు CS ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కావడంతో అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 2న జరిపే ఈ వేడుకలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లపై సీఎస్ శాంతకుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను కోరారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Next Story