HYD: బేగంపేటలో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య

by Disha Web Desk 2 |
HYD: బేగంపేటలో సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రైఫిల్‌తో కాల్చుకుని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. 2021వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన దేవేంద్ర కుమార్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ లడ్డా ఇంటి వద్ద సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, దేవేంద్ర కుమార్ రైఫిల్‌తో కాల్చుకుని గురువారం తెల్లవారుజామున బేగంపేట్ చీకోటి గార్డెన్స్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం ఐజీ ఇంటికి కొద్దిదూరంలోనే ఉండటం గమనార్హం. ప్రేమలో విఫలం కావటం వల్లనే అతను ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.



Next Story

Most Viewed