- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం ఒక సవాల్: ఎన్వీఎస్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో విస్తరణ పనుల ప్రక్రియను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రూట్ మ్యాప్ ను తాజాగా ఇంజినీర్లు పరిశీలించారు. శనివారం హైదారాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇంజినీర్ అడ్వయిజర్, రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఈ రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఇప్పటికే పలు దఫాలుగా ఈ రూట్ కు సంబంధించి పరిశీలనులు చేసిన అధికారులు తాజాగా మరోసారి తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు మార్గం చాలా క్లిష్టతరమైనదని అన్నారు. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ ను దాటడం ఒక పెద్ద సవాల్ అన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద అండర్ పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లై ఓవర్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయని చెప్పారు. మూడు అడ్డంకులను దాటేందుకు ప్రత్యేక స్పాన్ నిర్మాణం చేస్తామని, ఉత్తమమైన ఇంజినీరింగ్ పరిష్కారాలను సూచించేందుకే తనిఖీలు చేశామని చెప్పారు.