- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైళ్లలో నేరాలను నియంత్రించాలి: DGP Anjani Kumar
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : రైళ్లలో నేరాల నియంత్రణకు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. రైళ్లు, రైల్వే ట్రాక్లపై జరిగే మరణాల సంఖ్యను తగ్గించాలని, మానవ అక్రమ రవాణా, చోరీలను కట్టడి చేయాలని సూచించారు. రాష్ట్ర రైల్వే భద్రతా కమిటీతో గురువారం డీజీపీ అంజనీ కుమార్తన ఆఫీసులో భేటీ అయ్యారు. ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్స్ను గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రన్నింగ్ ట్రైన్లలో చైన్స్నాచింగ్ల్, ఫోన్ల చోరీలపై షార్ట్ఫిల్మ్రూపొందించి ప్రయాణికుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్కెమెరాల సాయంతో నేరాలను తగ్గించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ అవకాశంగా చేసుకుని జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయాలని, అవసరమైతే మీడియా సాయం కూడా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రైల్వే అదనపు డీజీ శివధర్రెడ్డి, అదనపు డీజీ (శాంతి భద్రతలు) సంజయ్ కుమార్ జైన్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read...
అక్కడ ఫ్లెక్సీ వార్.. ఆధ్యాత్మిక ఫ్లేక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..