జర్నలిస్టు తులసి చందు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె .సాంబశివరావు

by Dishafeatures2 |
జర్నలిస్టు తులసి చందు రక్షించాల్సిన  బాధ్యత ప్రభుత్వాలదే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె .సాంబశివరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జర్నలిస్ట్ తులసి చందుపై ప్రాణహాని, బెదిరింపులు జరుగుతున్నాయని అన్నివిధాల ఆమెకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు . సామాజిక ఉద్యమకారులను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్ పరివార్ మతోన్మాద మూకలే హత్యచేసినటువంటి ఘటనలు మరచిపోకముందే ఆ దాడుల పరంపర కొనసాగుతుందని అన్నారు . తులసికి ఎటువంటి హాని జరిగినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సివుంటుందని హెచ్చరించారు .

కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్న స్వంతంత్ర జర్నలిస్టు తులసి చందుపై వేధింపులు, ట్రోలింగ్‌, ప్రాణహాని ఖండించారు . ఇది ఫాసిస్టు దోరణికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. తమ విధానాలను ప్రశ్నించే వ్యక్తులు, శక్తులపై దాడి చేయడం బిజెపి అధికారంలోకి వచ్చాక పరిపాటిగా మారిందని అయన ఒక ప్రకటనలో విమర్శించారు.

గతంలో సల్మాన్‌ రష్మీ,అరుందతి రాయ్‌, తస్లీమానస్రీన్‌ తదితరులపైన ఇదే పద్ధతులలో మతశక్తులు వారి భావాలను అంగీకరించనటువంటి కొన్ని ముస్లీం ఉగ్రవాద సంస్థలు, ఇతర సంస్థలు ఫత్వా తదితర పద్ధతుల ద్వారా ప్రాణాలు తీయడానికి పిలుపివ్వడం జరిగిందని తెలిపారు . అదే విధంగా కల్బుర్గి, గోవింద్‌ పన్సారే, గౌరి లంఖేష్‌, దబోల్కర్‌ తో పాటు మేధావులు,సామాజిక ఉద్యమకారులు, హేతువాదులు, లౌకికవాదులు, కవులు, కళాకారులు, పాత్రికేయులు సమాజ హితం కోసం ప్రశ్నించేవారిని, సత్యశోధన చేసేవారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలపైన ఉన్నదని కూనంనేని పేర్కొన్నారు .



Next Story

Most Viewed