- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిందే

- కుల గణనకు కాలపరిమితి విధించండి
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- పాకిస్తాన్దుశ్చర్యను ప్రపంచ మంతా గమనిస్తోంది : మాజీ ఎంపీ అజీజ్ పాషా
దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ - పాకిస్థాన్ ల కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు. కానీ.. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించాలని భారత్ శాంతి చర్చల్లో ప్రతిపాదించాలని డిమాండ్ చేశారు. మానవాళికి బద్ద శత్రువైన ఉగ్రవాదం ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దానిని సమూలంగా నిర్మూలించాల్సిందేనన్నారు. మృతుల తల్లిదండ్రుల కన్నీరు ఊరికే పోదని ఆయన వ్యాఖ్యానించారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూభవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం పక్కా ప్రణాళికతో పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షణ కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేయడం ద్వారా భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటారని డాక్టర్కే. నారాయణ ప్రశంసించారు. పహల్గామ్ ముష్కరులు కాళ్ల పారాణి ఆరకుండానే భార్య ముందు భర్తను చంపడం హేయమైన చర్య అన్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కొల్పొయిన ఎపికి చెందిన అగ్నివీర్ మురళి నాయక్ కు ఘనంగా నివాళులు అర్పింస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో దౌత్యపరంగా ప్రపంచ దేశాలతోమరింత మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకుని వాటిని ఏకం చేయాల్సిన అవసరముందన్నారు. తద్వారా అంతర్జాతీయ ఉగ్రవాది అయిన మాసుద్ అజర్ ను భారత్ రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాకిస్తాన్ కు చైనా మద్దతు ఇస్తుందనేది అపోహ మాత్రమేనని , ఇందుకు సంబంధించి చైనా అధికారికంగా సైతం స్పష్టం చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా నారాయణ తెలిపారు.
కుల గణనకు కాలపరిమితి విధించండి
కాగా, కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణనను సిపిఐ పూర్తిగా స్వాగతిస్తుందని, అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఖచ్చితమైన కాలపరిమితిని నిర్ణయించాలని డాక్టర్ నారాయణ కోరారు. తద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి కుల గణన ప్రక్రియను పూర్తి చేసి చట్ట సభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించి వారు పోటీ చేసేందుకు అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించాలని నారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలను సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తప్పుబట్టారు. మహిళలను పూజించే ఈ దేశంలో మహిళల అంగాంగ ప్రదర్శనతో నిర్వహించే అందాల పోటీల ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏమి సందేశం ఇవ్వాలకుంటుందని ప్రశ్నించారు. ప్రపంచ సుందరీమణులను పర్యాటక ప్రదేశాల్లో ఊరేగించినంత మాత్రాన ఈ రంగం అభివృద్ది చెందుతుందా అని నారాయణ ప్రశ్నించారు. పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా వివిధ ప్రాంతాలకు పర్యాటకులు వచ్చేందుకు వీలు కలుగుతుందని సూచించారు.
పాకిస్తాన్ దుశ్చర్యను ప్రపంచ మంతా గమనిస్తోంది : మాజీ ఎంపీ అజీజ్ పాషా
పాకిస్తాన్ దుశ్చర్యలను ఇప్పటికే ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని, కేవలం టర్కీ దేశం తప్ప అన్ని దేశాలు భారత్ కు మద్దతుగా నిలిచాయని మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. భారత్ పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ తెగబడి 400 డ్రోన్లను ప్రయోగించగా, వాటిని భారత సైన్యాలు విజయవంతంగా తిప్పికొట్టడం అభినందనీయమన్నారు. అజ్మల్కసబ్ లాంటి ఉగ్రవాదులు శిక్షణ పొందిన లష్కరే తొయిబా లాంటి ప్రధానమైన ఉగ్ర శిబిరాలను భారత సైన్యం పూర్తిగా ధ్వసం చేయడం మన దేశ సైనిక శక్తి పాటవానికి నిదర్శమన్నారు. పాకిస్తాన్ మాత్రం జమ్ములోని చర్చిలు, గురుద్వారాలు, ఆలయాలపై దాడులు చేసి మతకల్లోలాలను సృష్టించడం ద్వారా అంతర్గత భద్రతను దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నప్పటికీ భారతీయులంతా ఐక్యంగా ఉన్నారన్నారని మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు.