- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CP Sajjanar: అర్ధరాత్రి రౌడీ షీటర్ల ఇళ్లకు సజ్జనార్.. స్వయంగా పెట్రోలింగ్ చేసిన సీపీ
హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ విధి నిర్వహణలో మరోసారి తనదైన శైలిని ప్రదర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని రౌడీషీటర్లను హైదరాబాద్ సిటీ సీపీ వి.సి సజ్జనార్ హెచ్చరిచారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని వారికి హితవు పలికారు. సజ్జనార్ నిన్న ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వయంగా పెట్రోలింగ్ చేశారు. లంగర్ హౌస్, టోలి చౌకి ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండా పెట్రోలింగ్ వాహనంలోనే లంగర్ హౌజ్ పీఎస్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. వారి నేర చరిత్ర, జీవనశైలిపై ఆరా తీశారు. నేర ప్రవృత్తి మానుకోవాలని సూచించారు. అనంతరం టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్త, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టోలిచౌకి పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా పరిశీలించారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి:
ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో పోలిసింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. విజిబుల్ పోలిసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే విధంగా బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.






