కేబీఆర్ పార్కు చుట్టూ రెండవ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ సజ్జనార్

by Ramesh Naini |

హెచ్-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన రెండో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కేబీఆర్ పార్కు చుట్టూ రెండవ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించిన రెండో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, డీసీపీ కాజల్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణా రెడ్డి తదితర అధికారులతో కలిసి కేబీఆర్ పార్క్ గేట్, బసవతారకం ఆస్పత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నంబర్-45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వంటి ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు.

ప్రజలకు కీలక విజ్ఞప్తి

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన తొలి ట్రయల్ రన్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకుంటూ రెండో వన్‌వే ట్రయల్ రన్‌ను చేపట్టినట్లు తెలిపారు. ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత సులభతరం చేయడం, నగర వాసులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా చేపడుతున్న ఈ మార్పులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.

Next Story