మెడికో ప్రీతి మరణానికి కారణం అదే: CP రంగనాథ్

by Disha Web Desk 19 |
మెడికో ప్రీతి మరణానికి కారణం అదే: CP రంగనాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ప్రీతి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వరంగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా వరంగల్ కమిషనర్ రంగనాథ్ మెడికో ప్రీతి ఘటనపై రియాక్ట్ అయ్యారు. మెడికో ప్రీతి మరణానికి కారణం ర్యాగింగే అని ఆయన తెలిపారు. ప్రీతి మరణంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో అన్ని విషయాలు తేలుతాయని అన్నారు. ప్రీతి సూసైడ్ విషయంలో ఆమె సీనియర్ సైఫ్‌తో పాటు మరో ఇద్దరిపై అనుమానం ఉందన్నారు.

Also Read..

కామ వాంఛ తీర్చుకోవడానికి కట్టుకున్నోడినే కడతేర్చారు..

Next Story

Most Viewed