Atrocious: గోవులపై ఆగని దాష్టికం..

by Disha Web Desk 3 |
Atrocious: గోవులపై ఆగని దాష్టికం..
X

దిశ వెబ్ డెస్క్: గో సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా గో హింసను మాత్రం అడ్డుకోలేకపోతోంది. గోవుల కోసం గోశాలలు ఏర్పాటు చేసిన గోవులకు రక్షణ కల్పించలేక పోతున్నారు. నిత్యం ఎక్కడో చోట కిరాతకులు చేతిలో గోవులు ప్రాణాలను కోల్పోతూనే ఉన్నాయి. కొందరు దుర్మార్గుల దాష్టికానికి గోవులు బలైపోయిన ఘటనలు గతంలో కోకొల్లలు.

తాజాగా అల్లాంటి ఘటనే హైద్రాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హైద్రాబాద్ లోని మన్సూరాబాద్ డివిజన్ జడ్జ్ కాలనీ లోని గోశాల లో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు గోవులను ఎత్తుకెళ్లేందుకు గోశాలలో జొరబడ్డారు. ఆ తరువాత ఆ గోవులు అరవకుండా గోవులకు మత్తు మందు ఇచ్చారు. దీనితో ఆ మత్తుమందు డోస్ ఎక్కువ కావడం కారణంగా మూడు గోవులు మృతి చెందగా.. మరో రెండు గోవుల పరిస్థితి విషమంగా ఉంది.

అలానే మరో మూడు గోవులను దుండగులు ఎత్తుకెళ్లారు. కాగా ఈ ఘటనపై స్పందించిన కార్పొరేటర్ నరసింహ రెడ్డి దుండగుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ వారిపై కట్టిన చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed