28న ‘దోస్త్’ సెల్ఫ్ రిపోర్టింగ్.. క్లాసులు 28 నుండి

by Dishafeatures2 |
28న ‘దోస్త్’ సెల్ఫ్ రిపోర్టింగ్.. క్లాసులు 28 నుండి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాల సూచన, అలాగే బుధ, గురు వారం (25, 26) తేదీల్లో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో డిగ్రీ కళాశాలలో దోస్త్-2023 షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి సవరించింది. దోస్త్ ఫేజ్-III సంబంధించి సవరించిన షెడ్యూల్ తేదీలలో రిపోర్ట్ చేయాలనీ విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి కమీషనర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్.ఆర్.లింబాద్రి ప్రకటించారు .

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ (కళాశాల ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా రుసుము/సీటు రిజర్వేషన్ రుసుము ) థర్డ్ ఫేజ్ విద్యార్థులకు అలాగే ఫేజ్ 1, 2, 3లలో ఆన్ లైన్ లో సీట్లు నిర్దారించుకున్న విద్యార్థులు (సెల్ఫ్ రిపోర్టింగ్ ) 28 వ తేదీన రిపోర్ట్ చేయాలని తెలిపారు. అలాగే ఫస్ట్ సెమిస్టర్ తరగతులు 28వ తేదీన ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Next Story

Most Viewed