సొంత ఖర్చుతో ఆలయ ముఖద్వారా నిర్మాణం.. పనులు ప్రారంభం

by Disha Web Desk 2 |
సొంత ఖర్చుతో ఆలయ ముఖద్వారా నిర్మాణం.. పనులు ప్రారంభం
X

దిశ, మర్రిగూడ: నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండల కేంద్రంలోని శ్రీభవాని రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారా నిర్మాణ పనులకు గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్నరావు దంపతులు శంకుస్థాపన చేశారు. రూ.2 లక్షల వారి సొంత డబ్బుతో ముఖ ద్వారా నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలయ పూజారి ఎల్వీ శర్మకు ఆ చెక్కును అంజన్నరావు దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొనుగోటి విజయ రామారావు, తాజా మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed