- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vidyasagar Rao: పిల్లలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో ఇదొకటి
by Gantepaka Srikanth |
హైదరాబాద్లోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ(Constitution Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ(Constitution Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు() హజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమని అన్నారు. పౌరులందరికీ రాజ్యాంగం సమన్యాయం చేకూరుస్తుందని తెలిపారు. అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అజేయ శక్తిగా ఎదగానికి కారణం భారత రాజ్యాంగమని చెప్పారు. అశోక చక్రంలోని సలకాల గురించి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ mlc రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story






