నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

by Disha Web Desk 14 |
నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కిషన్ రెడ్డి.. ఉచిత బస్సు ప్రయాణం నిజం కాదా..? ని కండ్లకు కనిపించడం లేదా? నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు.. అట్లనైన తెలుస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యిందని, 20 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని చెప్పారు. కాంగ్రెస్ ని విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకోవాలని కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. నీ పార్టీ సంసారమే సక్కగా లేదు.. మా ఇంచార్జీల గురించి ఎందుకు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంచార్జీల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ముందు నీ పార్టీ మీద ఉన్న బురద కడుక్కో కిషన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు.

కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్

రాష్ట్రంలో ఏమైతుందని తెలుసుకోలేని నువ్వు ఏం రాష్ట్ర అధ్యక్షుడివి.. నువ్వేం కేంద్ర మంత్రివి అని విమర్శించారు. నేను.. నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదామన్నారు. కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యాడని ప్రశ్నించారు. కేసీఆర్ ని బండి సంజయ్ తిడుతున్నాడని, కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడని విమర్శించారు. ఇది వారి పార్టీ నేతలు అంటున్నారని అన్నారు. నీ కుర్చీనే నువ్వు కాపాడుకోలేక పోయావు.. కాంగ్రెస్ మీద విమర్శలు ఎందుకు బండి సంజయ్ అని కిషన్ రెడ్డి.. బండి సంజయ్‌పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed