- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక ప్రకటన
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt), తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt), తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్నా కేటాయించిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల కేంద్రం చూపిస్తున్న కపట ప్రేమను అందరూ గమనించాలని కోరారు. రాజకీయంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు పనికిరారని విమర్శించారు. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. తామేం ఊరుకోమని.. కేంద్రంపై కాంగ్రెస్(Congress) తరపున పోరాటం చేస్తామని కీలక ప్రకటన చేశారు. అనవసరమైన వాగుడు వాగడానికే తెలంగాణ బీజేపీ నేతలు పనికొస్తారని ఎద్దేవా చేశారు.
బడ్జెట్ యూనియన్బడ్జెట్(Union Budget 2025)లా లేదని, బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్లా ఉందని అన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులవి కోతలు తప్ప చేతలు లేవన్నారు. పన్నుల్లో వచ్చే వాటా తప్ప ప్రత్యేకంగా తెలంగాణకు ఒక్క రూపాయి తేలేకపోయారని విమర్శించారు. కేంద్రం చేసిన మోసంపై కిషన్రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిధులు తీసుకొచ్చి దమ్ము నిరూపించుకోవాలని సవాల్ చేశారు. యూపీఏ హయాంలో హైదరాబాద్లో మౌలిక వసతులు కల్పించడం వల్లే రాష్ట్ర బడ్జెట్మూడు లక్షల కోట్లకు చేరిందని, ఇది యూపీఏ ఘనత అని, మీ చరిత్ర ఏమిటో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తెలంగాణ నుంచి ప్రజలు ఏడాదికి రూ.లక్ష కోట్ల పన్నులు కడ్తున్నా వచ్చేది గోరంతే అన్నారు.






