హాలో.. ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్: రెడీ అవుతున్న కాంగ్రెస్ టెలీ కాలర్స్ టీమ్

by Dishafeatures2 |
హాలో.. ప్లీజ్ ఓట్ ఫర్ కాంగ్రెస్: రెడీ అవుతున్న కాంగ్రెస్  టెలీ కాలర్స్ టీమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్​ ఎన్నికల మూడ్​ లోకి వచ్చేసింది. ప్రజల మద్ధతును కోరేందుకు వివిధ రకాల ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నది. దీనిలో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్​లను విరివిగా వాడనున్నది. ఇప్పటికే ప్రచారం కోసం సోషల్ మీడియా వేదికలను వేగంగా వాడుతుండగా.. ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు టెలీ కాలర్స్​ విధానాన్ని ప్రారంభించనున్నారు.‘హాలో.. ప్లీజ్​ ఓట్​ ఫర్ కాంగ్రెస్​’అనే స్లోగన్ తో ఓటర్లతో మాట్లాడనున్నారు.ఈ మేరకు కాంగ్రెస్​పార్టీ ప్రత్యేకంగా టెలీ కాలర్స్​ను నియమించుకున్నది.ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం.

ఓటర్లను ఆకట్టుకునే తీరుపై ఇందిరాభవన్ లో లో సదరు టెలీ కాలర్స్ కు ట్రైనింగ్ కూడా పూర్తయినట్లు తెలిసింది. జిల్లాకో కేంద్రం చొప్పున 33 జిల్లాల్లో కార్యాలయాలు ఓపెన్​ చేయనున్నారు. అక్కడి నుంచే టెలీ కాలర్స్ ​ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లతో నేరుగా మాట్లాడనున్నారు. ఈ టెలీ కాలర్స్​టీమ్​ లో 75 శాతం మంది మహిళలు ఉండగా,మరో 15 శాతం మంది పురుషులు ఉన్నారు. సోషల్ మీడియా టీమ్​లతో సమన్వయమై ఈ కాలర్స్ టీమ్ పనిచేయనున్నది. అన్ని జిల్లాల టీమ్​లను హైదరాబాద్​ లో సెంట్రల్ ఆఫీస్​నుంచి మానిటరింగ్ చేయనున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్​..?

టెలీ కాలర్​ విధానంలో కాంగ్రెస్​ కు ఓటేయ్యమని కోరడమే కాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను సైతం వివరించాలని టీమ్​ప్లాన్​చేసింది.9 ఏళ్లలో మోడీ, కేసీఆర్​ఇచ్చిన హామీలు, అమలు కానీ విధానాలు వంటివాటిపై ఓటర్లకు అర్థమయ్యే రీతిలో చెప్పనున్నారు.అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్​లలో జరిగే అన్యాయం, మిస్టెక్స్​, అవినీతిపై చెప్పనున్నారు.కర్ణాటక తరహాలో హామీలను నెరవేర్చేందుకు భరోసా కల్పించనున్నారు.యువత, రైతులు, మహిళలకు కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే అంశాలపై వివరించనున్నారు. ఒక్క ఛాన్స్​అంటూ ఓటర్లను అభ్యర్ధించనున్నారు.

లీడర్​ షిప్పై కూడా..

కాంగ్రెస్​ పార్టీని గెలిపించేందుకు మన రాష్ట్రంలోనూ కర్ణాటక తరహాలో విధానాలను ఇంప్లిమెంట్ చేయనున్నారు. దీంతోనే టీపీసీసీ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నది. అయితే టెలీ కాలర్స్ కు అనుసంధానంగా కొందరు పార్టీ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు. ఈమేరకు యూత్ కాంగ్రెస్​ నుంచి జిల్లాకు ఒక వ్యక్తిని ఎంపిక చేశారు. వీరితో పాటు స్టేట్​ లెవల్ లో మరో టీమ్​ పని చేస్తుంది. వీరందరికీ రేపటి నుంచి గాంధీభవన్​లో వర్క్​ షాప్ మొదలుకానున్నది.




Next Story

Most Viewed