కార్మికుల పక్షాన కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి

by Disha Web Desk 4 |
కార్మికుల పక్షాన కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి
X

దిశ, నిజామాబాద్ సిటీ: కార్మిక సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా ఐఎన్‌టీ‌యూసీ అధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమములో ఐ‌ఎన్‌టీ‌యూసీ రాష్ట్ర జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. నాయకులు ఏడ్ల నాగరాజు, పుదరి గంగాధర్. వేణు, గోపాల్, పెంటా చారీ, జాక్రియ, కార్తిక్, మొహియుద్దీన్, శ్రీనివాస్, భుమేష్, అసిఫ్, నాంపల్లి మోహన్, మీర, గంగాధర్, చందు తదితరులు పాల్గొన్నారు.

నీల కంఠేశ్వర ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..

జోడో యాత్రలో భాగంగా బుదవారం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు స్వాగతం పలుకగా ఆలయంలో అర్చన, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచుతామన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కేశవేణు, గడుగు గంగాధర్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed