కాంగ్రెస్ మేనిఫెస్టో.. 5 అంశాల్లో ఆకునూరి మురళి కీలక సూచన

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ మేనిఫెస్టో.. 5 అంశాల్లో ఆకునూరి మురళి కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రెండో రోజు గాంధీ భవన్‌లో మేనిఫెస్టో కమిటీ సమావేశం అయింది. శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీ భవన్‌లో భేటీ అయింది. ఈ భేటీకి దామోదర రాజానర్సింహా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. కాగా ఈ కమిటీకి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి పలు కీలక సూచనలు చేశారు. బుధవారం గాంధీ భవన్‌కు వచ్చిన ఆకునూరి మురళి.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 అంశాలపై సూచనలు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, కరప్షన్ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై ఆయన పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు.

Next Story

Most Viewed