విజయవాడకు లిక్కర్ రవాణా కేసు నిందితులు.. కోర్టులో ప్రొడ్యూస్

by Vemula.Srinu Prasad |

లిక్కర్ రవాణా టెండర్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితులను సిట్ అధికారులు తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు....

విజయవాడకు లిక్కర్ రవాణా కేసు నిందితులు.. కోర్టులో ప్రొడ్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ రవాణా టెండర్ల కేసు(Liquor transport tenders case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితులను సిట్ అధికారులు తాజాగా హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడ(Vijayawada)కు తరలించారు. చంచల్ గూడ జైలు(ChanchalGuda Prison)లో ఉన్న నిందితులు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్‌ను పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు వారికి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టడంతో ఇరువర్గాలు వాదనలు వినిపిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని సిట్ వాదనలు వినిపిస్తోంది. దీంతో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Next Story