బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది: సునీతరావు

by Satheesh |

ప్రజలపై ఆర్థిక భారం పడేలా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్​ధరలను వెంటనే తగ్గించాలని మహిళా కాంగ్రెస్​అధ్యక్షురాలు సునీత రావు పేర్కొన్నారు.

బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది: సునీతరావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలపై ఆర్థిక భారం పడేలా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్​ధరలను వెంటనే తగ్గించాలని మహిళా కాంగ్రెస్​అధ్యక్షురాలు సునీత రావు పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్​ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్​సిలిండర్‌ను మోడీ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ.1200కు పెంచడం దారుణమన్నది. పెంచిన సిలిండర్​ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్​చేశారు.

కాంగ్రెస్​సీనియర్​నేత పుష్పలీల మాట్లాడుతూ.. బీజేపీ పెంచిన ధరలను పరిశీలిస్తే ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​ప్రభుత్వాలు రెండూ ఒకటేనని, ప్రజలకు గమనించాలని కోరారు. మళ్లీ కట్టెలతో వంట చేసే పరిస్థితి వచ్చిందన్నారు. టీపీసీసీ స్పోక్స్​పర్సన్​కాల్వ సుజాత మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని, ప్రజలంతా అలెర్ట్‌గా ఉండాలని కోరారు.

Next Story