Munugode by-poll: మునుగోడులో చరిత్ర సృష్టించబోతున్నాం.. జానారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
Munugode by-poll: మునుగోడులో చరిత్ర సృష్టించబోతున్నాం.. జానారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడులో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని, ఈ ఉప ఎన్నికతో మునుగోడులో చరిత్ర సృష్టించబోతున్నామంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు సైతం పార్టీలకతీతంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధమయ్యారని తెలిపారు. డబ్బులతో టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇతర నియోజకవర్గాల్లో ఓటర్లను కొనుగోలు చేసినట్లు ఇక్కడ జరుగదని, మునుగోడు ప్రజలు చైతన్యవంతులని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ సునాయాసంగా గెలవబోతోందని జోస్యం చెప్పారు.


Next Story