సీఎం ఆదేశాలతోనే అక్రమ మైనింగ్​లు.. కాంగ్రెస్​ నేత బక్క జడ్సన్​

by Dishafeatures2 |
సీఎం ఆదేశాలతోనే అక్రమ మైనింగ్​లు.. కాంగ్రెస్​ నేత బక్క జడ్సన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం ఆదేశాలతోనే రాష్ట్రంలో అక్రమమైనింగ్​లు జరుగుతున్నాయని కాంగ్రెస్​ నేత బక్క జడ్సన్ పేర్కొన్నారు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో అక్రమ మైనింగ్​లు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన గన్​ పార్క్​వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్సన్​మాట్లాడుతూ.. కేసీఆర్​ అండదండలతోనే అక్రమ మైనింగ్​లు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. తాము దీక్షకు దిగితే విఫలం చెయ్యడానికి సీఎం 100 మంది పోలీసులను పంపించారన్నారు. బండ రావిరాల, చిన రావిరాల, తారామతిపేట, దేశముఖిలోని సర్వే నెం.268లో 670 ఎకరాలలో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, రెడీ మిస్​, హాట్ మిస్ ప్లాన్‌ లు చేస్తున్నారన్నారు.

సహజ వనరులను రహస్యంగా వెలికితీస్తున్నారన్నారు. ఆయా కంపెనీలు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రశ్నించినోళ్లపై బెదిరింపులకు దిగుతున్నట్లు జడ్సన్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్రమ మైనింగ్ పోరాట నాయకులు కృష్ణ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబు, ఉపేందర్ యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed