ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై రేవంత్​రెడ్డి మౌనంలో అంతర్యమేమిటీ..? బక్క జడ్సన్​

by Disha Web Desk 19 |
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై రేవంత్​రెడ్డి మౌనంలో అంతర్యమేమిటీ..? బక్క జడ్సన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మౌనం వహించడంలో అంతర్యమేమిటనీ? స్వయంగా కాంగ్రెస్​నేత బక్క జడ్సన్ ​విమర్శించారు. ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కవిత రిక్వెస్టులను ఈడీ పరిగణలోకి ఎలా? తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు పొలిటికల్ ఒత్తిళ్లకు గురి కాకుండా ఆరోపణలను ఎదుర్కొంటున్నా వారిని విచారించాలని జడ్సన్ డిమాండ్ చేశారు. కవితపై సింపతి వచ్చేందుకు జంతర్​మంతర్​ధర్నాకు బీజేపీ పర్మిషన్​ఇచ్చిందని జడ్సన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story