పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం..

by Disha Web Desk 4 |
పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాల మేరకు చేరికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత, సిద్ధాంతం పట్ల నమ్మకం, అవగాహన ఉన్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది. కమిటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి లు సభ్యులుగా ఉండనున్నారు. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు గాంధీ భవన్‌లో చేరికలు ఉంటాయని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.

Read More...

BREAKING: ఎన్నికల వేళ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన.. తెలంగాణ సెకండ్ క్యాపిటల్‌ అదే..!



Next Story

Most Viewed