మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతుండు: T- కాంగ్రెస్ ఫైర్

by Disha Web Desk 19 |
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతుండు: T- కాంగ్రెస్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. లక్షల కోట్ల స్కాంలకు పాల్పడ్డ లలిత్ మోదీ, విజయ్ మాల్యాలను వదిలేసి 100 కోట్ల స్కామ్‌కే ఒక అడబిడ్డపైన బీజేపీ ప్రతాపం చూపిస్తుందన్న మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ‘‘100 కోట్లకే కేసేంది’ ఇదీ ఈ దొంగ శ్రీనివాస్ గౌడ్ కొవ్వెక్కిన మాటలు!. మీ అవినీతి పార్టీకి సిగ్గుందా కేసీఆర్?.. దోపిడీ దొంగలు, కల్వకుంట్ల గేటు దగ్గర అవినీతి ఎంగిలి బొక్కలు తిన మరిగినోళ్ళకు 100 కోట్లంటే లెక్క ఉండదు. ప్రజలారా కేసీఆర్ మంత్రుల కొవ్వెక్కిన మాటలు గమనించాలి!’ అంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా, మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఒక అడబిడ్డపైన బీజేపీ ప్రతాపమా..? అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం 100 కోట్ల స్కామ్ అయితే.. మీ నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, ఆదానీవి ఎన్ని లక్షల కోట్లు ఆవిరై పోయాయని, చోక్సీ భాయిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ సంపద దోచుకొని యూకేలో జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. దోస్తులను వదిలేసి.. తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారని, ఎప్పుడు పిలిచిన ఎమ్మెల్సీ కవిత విచారణకు వచ్చిందన్నారు.



Next Story

Most Viewed