బిగ్ న్యూస్: 111 జీవో రద్దుపై T- కాంగ్రెస్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: 111 జీవో రద్దుపై T- కాంగ్రెస్ సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: 111 జీవో ఎత్తివేత అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ అంశంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేత్తపై ఏడుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీవో ఎత్తివేత, పరిణామాలపై అధ్యయనం చేసి పార్టీ పెద్దలకు నివేదిక సమర్పించనుంది. జీవో రద్దుతో జంట జలాశయాలకు నష్టం కలుగుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది. అలాగే ఈ జీవో పరిధిలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అధికార పార్టీ నేతల చేతుల్లోకి భూములు వెళ్లిన తర్వాతే ఈ జోవోను ప్రభుత్వం రద్ధు చేసిందని ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో త్రిబుల్ వన్ జీవో వెనుక ఉన్న మతలబు ఏంటి? ఈ జీవో ఎత్తివేయడం ద్వారా చెరువు ధ్వంసం ఏ విధంగా ఉండనుంది అనేది ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను పార్టీ పెద్దలకు సమర్పించనుంది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కోదండరెడ్డితో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలు ఉన్నారు.

Also Read...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ORR స్కామ్ వెయ్యి రెట్లు పెద్దది: రేవంత్ రెడ్డి


Next Story