శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో ఉద్రిక్త వాతావరణం.. ఆందోళనకు దిగిన ప్రయాణికులు!

by Disha Web Desk 19 |
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో ఉద్రిక్త వాతావరణం.. ఆందోళనకు దిగిన ప్రయాణికులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం విమాన ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 7 గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదని వారితో వాగ్వాదానికి దిగారు.

ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం తొలుత 11.45 వెళ్తుందని అధికారులు ప్రకటన చేశారని.. ఇప్పటివరకు ఎప్పుడు బయలుదేరుతుందో ఎయిర్ ఇండియా సిబ్బంది క్లారిటీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. 8 గంటల నుంచి ఎదురుచూస్తున్నామని, ఇంకెంత సేపు ఇలా వెయిట్ చేయిస్తారంటూ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. విమానం ఎప్పుడు బయలు దేరుతుందో చెప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా, ఫ్లైట్ టైమింగ్స్‌లో నిర్లక్ష్యం వహించడంపై ప్రయాణికులు, సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది.


Next Story

Most Viewed