- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారైనా ప్రిపేర్ అయి రండి ఉత్తమ్ గారు.. ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు
నది జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి అడ్వైజర్ను పెట్టుకోవాలని, ఈసారైనా అసెంబ్లీకి ప్రిపేర్ అయి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.

దిశ, వెబ్డెస్క్: నది జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) మంచి అడ్వైజర్ను పెట్టుకోవాలని, ఈసారైనా అసెంబ్లీకి ప్రిపేర్ అయి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంతో ఉన్న పంచాయతీ సరిపోదు అన్నట్లుగా నీటి పారుదల శాఖకు ఆంధ్రా అడ్వైజర్ను పెట్టుకున్నారని.. అతన్ని వెంటనే తెలంగాణ సొంతోడు అడ్వైజర్గా పెట్టుకోవాలన్నారు.
రాష్ట్రంలో నూతన సంవత్సరం ‘బూతు సంవత్సరం’లా ప్రారంభమైందని, సీఎం రేవంత్ రెడ్డికి సబ్జెక్టుపై అవగాహన లేకనే ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో విషయాలు తక్కువ, బూతులు ఎక్కువగా ఉన్నాయని కామెంట్ చేశారు. తమ నాయకుడు కేసీఆర్ను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉరి తీయాలని అంటున్నారని.. మరోవైపు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వితండవాదాన్ని మానుకుని, హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.






