- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్కు బెదిరింపులు.. సీపీఎం జాన్ వెస్లీ హెచ్చరిక
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరించడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరించడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై యువత నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి, తమ విధానాలను మార్చుకోవాలని సీపీఎం డిమాండ్ చేశారు. ‘నువ్వు బీజేపీలో చేరు, డబ్బులు వస్తాయి.. లేకపోతే నిన్ను అమెరికాలోనే ఖతం చేస్తాం.. భారతదేశంలో ఉన్న నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని కూడా వదలకుండా ఖతం చేస్తాం’ అంటూ బెదిరింపులకు దిగడం అత్యంత దుర్మార్గమన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేసే ధోరణి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, అభిజిత్ ‘దళిత కార్డు’ వాడుతున్నాడు.. స్కిల్స్ (నైపుణ్యాలు) లేవు’ అని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం అందించిన ప్రజాస్వామిక హక్కులను, లౌకిక భావాలను, సోషలిస్టు ఆశయాలను కాపాడడంలో కేంద్రం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు. బెదిరింపులు, భయభ్రాంతులు, హత్య రాజకీయాల ద్వారా యువత గొంతు నొక్కాలని చూస్తే ప్రభుత్వాలు భ్రమల్లో ఉన్నట్టేనని, ఇటువంటి అణచివేత చర్యలను నేటి యువతరం సహించదని హెచ్చరించారు.






