- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా సర్దార్ సర్వాయి పాపన్న

దిశ, తెలంగాణ బ్యూరో : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు విగ్రహానికి శంకుస్థాపన చేయనున్నారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి డిమాండ్ ఉన్నా... బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం వహించడంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో ఆయన విగ్రహం ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హెచ్ఎండీఏ కమిషన్ సర్ఫరాజ్ అహ్మద్లు పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన అనంతరం రవీంద్ర భారతిలో జరిగే పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.






