నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగ‌ర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జటప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు.

నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
X

తెలంగాణ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగ‌ర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం జటప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అంతే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను సైతం పంపిణీ చేయ‌నున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సొంత జిల్లాకు రేవంత్ వ‌స్తుండ‌టంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్ప‌టికే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయ‌న జిల్లాపై ఎలాంటి వ‌రాల జ‌ల్లు కురిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story