జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ సమీక్ష

by Prasad Jukanti |
జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో : నేషనల్ హైవేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, జాతీయ రహదారులు నిర్మాణం సాగుతున్న ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధింత ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, పలు అంశాలపై సీఎం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్స్ సభ్యుడు అనిల్ చౌదరి ఆధ్వర్యంలో అధికారుల బృందం నిన్న సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న ఆర్ఆర్ఆర్‌ ప్రాజెక్టుకు తోడ్పాటు అందించాలని సీఎం కోరారు.

Advertisement

Next Story