- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం.. CM రేవంత్ ప్రకటన
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాల్సిందేనని, ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం కార్మిక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు.
నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని, ఏటీసీలలో అవసరమైన సిబ్బంది ఇతర వివరాలను అధికారులు సీఎంకు అందించారు. సిబ్బంది నియామకంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులు ప్రభుత్వం వెంటనే అందించేందుకు సిద్ధంగా ఉందని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్ పై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.






